🟥 తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం – రేపటిలోగా సరఫరా సాధారణం
🟥 పెట్రోల్–డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు సీరియస్… ఆయిల్ కంపెనీలకు కఠిన హెచ్చరిక 🟨 టెలికాన్ఫరెన్స్లో అధికారులను నిలదీసిన ఎంపీ… కృత్రిమ కొరత సృష్టించొద్దని సూచన 🟦 రేపటిలోగా సరఫరా సాధారణం చేస్తామని కంపెనీల హామీ 📍 భద్రాద్రి కొత్తగూడెం/చండ్రుగొండ, తెలంగాణ స్రవంతి ప్రతినిధి బొగ్గుల శివనాగిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంధన కొరత కారణంగా వాహనదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన తక్షణమే చర్యలు ప్రారంభించారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో పలువురు పెట్రోల్ బంక్ యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని కలిసి ఇంధన సరఫరాలో జరుగుతున్న జాప్యం, బంకుల్లో ఏర్పడిన కొరతపై వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అక్కడి నుంచే ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జి...